ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:58 IST)

తెల్లారగానే కడుపొచ్చింది.. 45 నిమిషాల్లో పండంటి మగబిడ్డ పుట్టాడు.. ఎక్కడ?

రాత్రి నిద్రించే ముందు వరకు బాగానే వుంది. ఉదయం నిద్రలేచే సరికి వింత జరిగింది. ఆ మహిళ కడుపు ఎత్తుగా కవిపించింది. ఆ కడుపు చూసి జడుసుకుని.. ఆస్పత్రికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ కారు పార్క్ చేసేలోపే పండంటి మగశిశువు పుట్టిన ఘటన స్కాట్లాండ్‌లో చోటుచేసుకుంది.


ఈ తతంగం అంతా 45 నిమిషాల్లోనే జరిగిపోయింది. 2018 జులై 17నే ఈ ఘటన జరిగింది. కానీ, ఓ ఆంగ్ల పత్రిక ఈ వార్తను ప్రచురించడంతో ఈ వార్త వైరల్‌గా మారిపోయింది.
 
వివరాల్లోకి వెళితే గ్లాస్గోవ్‌లో ఎమ్మాలూయిజ్ లెగ్గాటే అనే 18ఏళ్ల అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్, అమ్మమ్మతో కలిసి నివసిస్తుంది. కొన్ని నెలల క్రితమే ఆమెకి ఓ పాప కూడా పుట్టింది. అప్పట్నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతోంది.
 
ఇదే సమయంలో రుతుస్రావం ఆగిపోయింది. అయితే, మందుల కారణంగానే ఇలా అయి ఉంటుందని భావించింది ఎమ్మలూయిజ్. బరువు పెరిగినప్పటికీ రోజూ వాకింగ్ చేసేది.. ఇలా తనకు తెలియకుండానే గర్భం దాల్చింది. అయితే బిడ్డ నడుముకి కింది భాగంలోనే పెరిగింది. దీంతో కడుపు పైకి కనిపించలేదు.

అలాగే 8నెలలవరకు తనకు తెలియకుండానే బిడ్డను మోసింది. ఎనిమిదవ నెల వచ్చేసరికి బిడ్డ కదలికలు వేగమై ఉదయం అయ్యేసరికి కడుపు ఎత్తుగా అయి నొప్పులు వచ్చాయి. ఇలానే బిడ్డకు ఎమ్మాలూయిజ్ జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు.