ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (09:55 IST)

పాకిస్థాన్ వెబ్ సైట్లపై సైబర్ అటాక్.. ఇండియన్ హ్యాకర్ల పనేనట...

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్థాన్‌కు చెందిన 500 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. అందులో పాకిస్థాన్ సర్కారుకు చెందిన పలు ప్రధాన వెబ్ సైట్లు కూడా వున్నాయి. అంతేగాకుండా హ్యాక్ చేసిన వెబ్ సైట్లలో భారత్‌ను

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్థాన్‌కు చెందిన 500 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. అందులో పాకిస్థాన్ సర్కారుకు చెందిన పలు ప్రధాన వెబ్ సైట్లు కూడా వున్నాయి. అంతేగాకుండా హ్యాక్ చేసిన వెబ్ సైట్లలో భారత్‌ను కీర్తిస్తూ పోస్టులు పెట్టారు. కొన్ని వెబ్ సైట్లను వేగంగా పునరుధ్ధరించినప్పటికీ.. పునరుద్ధరణ జరగని సైట్లలో వెబ్ సైట్ అండర్ మెయింటెనెన్స్‌... విల్ బి బ్యాక్ సూన్... సారీ ఫర్ ది ఇన్ కన్వీనియెన్స్.. అంటూ సందేశాలు కనిపిస్తున్నాయి. 
 
లూలూసెక్ ఇండియా అని పిలువబడే హ్యాకర్ల బృందం పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశానికి చుక్కలు చూపించినట్లు పాకిస్థాన్ ఐటీ శాఖాధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య కాలంలో భారత వైబ్ సైట్లపై దాడి చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నించడం...ఆ వెంటనే భారత హ్యాకర్లు ప్రతీకార చర్యలకు దిగడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. 
 
పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ, జలవనరులు-విద్యుత్ శాఖ, వంటి పలు మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్ సైట్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు.