శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:44 IST)

ప్రధాని మోడీ కోసం నోరూరించే ప్రత్యేక వంటకాలు...

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హ్యూస్టన్‌లో ఉన్నారు. ఈ పర్యటన అధికారికంగా ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో ఆయనకు నోరూరించే ప్రత్యేక వంటకాలను అందించనున్నారు. 
 
హ్యూస్టన్‌కు చెందిన ప్రముఖ భారతీయ చెఫ్‌ కిరణ్‌ వర్మ, ఆయనకు పసందైన వంటకాలను వండి, వడ్డించేందుకు సిద్ధమయ్యారు. మోడీ కోసం ప్రత్యేకంగా నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఇవన్నీ స్వచ్ఛమైన భారత దేశీయ నెయ్యితో తయారవుతుండటం గమనార్హం. 
 
ఈ వంటకాల జాబితాలో రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి ఇందులో స్పెషల్. ఇక మిఠాయిల్లో భాగంగా రస్‌ మలాయ్, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌ (తీపి పెరుగు) ఉంటాయని తెలుస్తోంది. 
 
అలాగే, తాలి విషయానికి వస్తే, కిచిడీ, కచోరీ, మేతి తెప్లా తదితర వంటకాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను సిద్దం చేస్తున్నట్టు కిరణ్ వెల్లడించారు.