1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 26 మే 2015 (17:53 IST)

ఇద్దరు బిడ్డలను వదిలేసి.. ఐఎస్‌లో చేరిన ఆస్ట్రేలియా మహిళ..

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు ఇటీవల మహిళలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఆ కోవలో తాజాగా ఓ ఆస్ట్రేలియన్ మహిళ చేరింది. ఆమె తనకున్న ఇద్దరు బిడ్డలను వదిలేసింది. ఈ విషయం ఆమె సోదరితో చెప్పి తానిక ఎప్పటికీ ఇంటిమొఖం చూడనని చెప్పి వెళ్లిపోయింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరుపగా, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె జాస్మానియా మిలోవానోవ్ (26) అని తెలిసిందన్నారు. తాను ఐఎస్లో చేరబోతున్నట్లు పరోక్షంగా ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు తేలింది.