శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 జులై 2019 (16:39 IST)

అమెరికాలో భారతీయ పూజారిపై జాత్యాహంకార దాడి...

అమెరికాలో ఓ భారతీయ పూజారిపై దాడి జరిగింది. ఆయన నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ దాడి చేశాడు. ఈ దాడిలో పూజారి తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్వామీ హరీశ్ చందర్ పురీ (52) అనే పూజారీ సంప్రదాయిక దుస్తులు ధరించి ఫ్లోరల్ పార్క్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వెనుకనుంచి వచ్చి దాడికి పాల్పడ్డాడు. హరీశ్ చందర్ మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆయనకు మొహం మీద, శరీరంలో పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోగా.. చుట్టుపక్కల వారు హరీశ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... సీసీటీవీ ఫుటేజీ సహాయంతో దాడికి పాల్పడిన సెర్గియో గొవీయాను అదుపులోకి తీసుకున్నారు. అకారణంగా దాడికి పాల్పడినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. ఇది జాత్యాహంకార దాడి అయి ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
నచ్చకపోతే వెళ్లిపోండి అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు మూడు రోజుల్లోనే 'ఇది మా ఇలాఖా' అంటూ అని వ్యాఖ్యానిస్తూ ఈ దాడి జరగడం గమనార్హం.