గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (12:21 IST)

చైనా టైఫూన్.. వియత్నాంలో 141 మంది మృతి.. 59మంది గల్లంతు (video)

Typhoon Yagi
Typhoon Yagi
చైనా టైఫూన్ పర్యవసానంగా కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా వియత్నాం ప్రాంతంలో 141 మంది మరణించారు. 59 మంది తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 
 
మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందినవారు. 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు.
 
క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే లో రివర్ డైక్ నది నీటి పెరుగుదల కారణంగా గేట్లు తెగాయని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధృవీకరించారు.
 
రాజధాని హనోయిలోని రెడ్ నదిలో వరదల కారణంగా బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో-మెటియరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ అంచనా వేసింది.