1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:35 IST)

ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా కరోనా టీకా తీసుకున్న జో బైడెన్

అమెరికా దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా వేయించుకున్నారు. అదీకూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా ఆయన ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన స్వస్థలమైన డెలావర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ వల్ల భయపడడానికి ఏమీ లేదన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిపుణుల సూచనలు పాటించాలని అన్నారు. 
 
వైరస్ నుంచి బయటపడడానికి ఇది ఆరంభం మాత్రమేనని, మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు.
 
కాగా, గతవారం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు కూడా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. 
 
అమెరికాలో ఇటీవలే ఫైజర్ టీకా అందుబాటులోకి వచ్చింది. యూఎస్ రెగ్యులేటరీ ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.