శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:21 IST)

28 మంది ఇథియోపియన్ క్రైస్తవుల హతం: వైట్ హౌస్ ఖండన!

ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవలే లిబియాలో 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను చంపుతున్న వీడియోలను విడుదల చేసింది. బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన 29 నిమిషాల నిడివి గల వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. క్రైస్తవులు ముస్లీంలను మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
 
ముసుగు ధరించిన ఉగ్రవాదులు 12 మంది క్రైస్తవ బందీలను సముద్ర తీర ప్రాంతంలో తలలు నరికేస్తున్న వీడియో తీశారు. 16 మందిని ఎడారి ప్రాంతంలో తుపాకులతో కాల్చి చంపేసిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 28 మంది ఇథియోపియా క్రైస్తవులను దారుణంగా చంపేసిన ఐసిస్ తీరును వైట్ హౌస్ ఆదివారం నాడు తీవ్రంగా ఖండించింది.