శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

మళ్లీ డోక్లాం రచ్చం.. సైనికుల గస్తీ మధ్య రహదారి విస్తరణ పనులు

భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీ

భార‌త్, చైనా మ‌ధ్య చెల‌రేగిన డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఇటీవ‌లే స‌మ‌సిపోయి శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, అక్క‌డినుంచి ర‌హ‌దారి విస్త‌ర‌ణకు ఉపయోగించే యంత్రాలను, పరికరాలను కూడా చైనా తీసుకెళ్లింది. దీంతో సమస్య సమసిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. డోక్లాంకి 10 కిలోమీటర్ల దూరంలో మరో రహదారి విస్తరణ పనులను చేప‌ట్టింది. చైనా రోడ్డు నిర్మిస్తోన్న‌ ప్రాంతానికి దాదాపు 500 మంది చైనా సైనికులు ఇప్పటికే వచ్చేసి గస్తీ కాస్తున్నారు.
 
ఆ ప్రాంతం నుంచి ఇటీవ‌ల వెన‌క్కు తీసుకెళ్లిన రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే సామగ్రినే మ‌ళ్లీ వినియోగిస్తూ చైనా రోడ్డు ప‌నులు చేప‌డుతోంద‌ని నిఘావర్గాలు చెప్పాయి. దీని ద్వారా ఆ వివాదాస్పద ప్రాంతం త‌మ‌దేన‌ని చెప్పేందుకు చైనా మరోసారి ప్రయత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై భారత్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.