శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Selvi

ఐపీఎల్‌లో ఆడే ఆసీస్ ఆటగాళ్లతో సత్సంబంధాలున్నాయ్: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మంచి సంబందాలున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ధర్మశాల ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మంచి సంబందాలున్నట్లు భారత సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ధర్మశాల ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఉన్న స్నేహబంధం ఇకపై లేదని.. చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా జట్టులోని కొందరు క్రికెటర్లను ఉద్దేశించినవే కానీ.. అందరినీ ఉద్దేశించినవి కాదని చెప్పాడు. 
 
తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారనే ఉద్దేశంతోనే దీనిపై స్పందిస్తున్నానని.. ఇప్పటికీ పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తనకు మధ్య సత్సంబంధాలున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. భవిష్యత్తులోనూ ఆసీస్ ఆటగాళ్లతో స్నేహం కొనసాగుతుందని వివరించాడు. కాగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్ పూర్తయిన సందర్భంగా.. సిరీస్ ఆరంభించేందుకు ముందు ఆసీస్ క్రికెటర్లతో ఉన్న స్నేహభావం ఇప్పుడు లేదని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.