శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

అమితాబ్ సంకుచిత బుద్ధి.. ముంబై ఓడిపోతుందని టీవీ కట్టేశారట?

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. యావత్ భారత్ అభిమానించే నటుడు. అలాంటి బిగ్ బిలో సంకుచిత బుద్ధి ఉంటుందని ఓ సంఘటన ద్వారా నిరూపితమైంది. నెలన్నర రోజుల పాటు ఆలరించిన ఐపీఎల్ టోర్నీ గత ఆదివారం జరిగిన ఫై

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. యావత్ భారత్ అభిమానించే నటుడు. అలాంటి బిగ్ బిలో సంకుచిత బుద్ధి ఉంటుందని ఓ సంఘటన ద్వారా నిరూపితమైంది. నెలన్నర రోజుల పాటు ఆలరించిన ఐపీఎల్ టోర్నీ గత ఆదివారం జరిగిన ఫైనల్ పోరుతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో పూణె, ముంబై జట్లు తలపడగా, చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. 
 
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ అమితాబ్ బుద్ధి... సంకుచిత గుణం బయటపడింది. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కూడా కసిని ప్రదర్శిస్తూ ఆ గెలుపుపై సంకుచితంగా ఆలోచన చేశారు. నిజానికి అమితాబ్ బచ్చన్ ముంబై ఇండియన్స్‌ వీరాభిమాని. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తక్కువ స్కోరు చేయడంతో తన అభిమాన జట్టు ఓడిపోతుందని నిరాశగా టీవీ కట్టేశారంట. ఆ తర్వాత తన కుమారుడు ఫోన్‌ చేసి ముంబై గెలించిందనేసరికి ఆశ్చర్యపోయారట.
 
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు చేయడం అమితాబ్‌కు రుచించలేదు. అందుకే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తర్వాత కట్టేసిన టీవీవైపు మళ్లీ కన్నెత్తి చూడలేదంట. మ్యాచ్ అనంతరం అభిషేక్‌ బచ్చన్‌ సమాచారంతో సంతోషించిన ఆయన ట్విట్టర్‌లో ఆ అనుభూతిని డైలాగ్‌తో పంచుకున్నారు.