1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (13:15 IST)

ఐపీఎల్ 2020కి దూరమైన సురేష్ రైనా... దుబాయ్‌ నుంచి భారత్‌కు.. కారణం ఏంటి?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నుంచి సురేష్ రైనా తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020లో ఆడేది లేదని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు సురేష్ రైనా ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ సీజన్‌కి దూరమవుతున్నాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించింది. ఆయన దుబాయి నుంచి భారత్‌కు వెనక్కి వచ్చేశారని తెలిపింది.
 
కానీ సురేష్ రైనా ఐపీఎల్ 2020 నుంచి ఏ కారణం వల్ల తప్పుకోవాల్సి వచ్చిందనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి వుంది. ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెన్నై సూపర్‌ కింగ్స్ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్ పేర్కొంది. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడడానికి ఇప్పటికే జట్లు దుబాయికి చేరుకున్నాయి. కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో కొంతమందికి కరోనా సోకిందని వచ్చిన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా దుబాయి నుంచి తిరిగి వస్తుండటం గమనార్హం. సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సీఎస్కే తలపడాల్సి ఉంది.