శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (14:38 IST)

లాక్ డౌన్‌తో ఐపీఎల్ కష్టం.. కానీ క్రికెటర్లకు ఆ ఛాన్సుంది..?

కరోనా వైరస్ కారణంగా కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ తేల్చేసింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐకి లేదని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. 
 
క్రీడా రంగానికి సంబంధించి ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతించింది. అయితే లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షల కారణంగా ఐపీఎల్ సాధ్యం కాదని బీసీసీఐ తెలిపింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అధ్యయనం చేస్తున్నాం. దీని ప్రకారం మేం ఒక ప్రణాళిక రూపొందించుకుంటామని అరుణ్ ధుమాల్‌ వెల్లడించారు. 
 
కానీ క్రికెటర్లు ట్రైనింగ్ చేసేందుకు స్టేడియాలకు వెళ్లే ఛాన్సుంది. ఇంకా ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. ఆటగాళ్లందరూ ఒక్కో ప్రాంతంలో ఉండటంతో ఒకే దగ్గర జట్టు మొత్తం కలిసి సాధన చేసే ఛాన్స్‌ లేదని అరుణ్ వెల్లడించారు.