శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (10:29 IST)

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.వెయ్యికే 4జి ఫోన్?... జియోకు షాక్...

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది. రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో 4జి ఫీచర్‌ ఫోన్ల పోరు మొద

టెలికాంరంగంలో సంచనాలకు నాందిపలికిన రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చింది. రూ. వెయ్యికే 4జీ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో 4జి ఫీచర్‌ ఫోన్ల పోరు మొదలైంది. 
 
ఇటీవల ఉచితంగా రిలయన్స్‌ జియో 4జి ఫీచర్‌ ఫోన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా సరికొత్త ఫీచర్‌ ఫోన్‌ తీసుకొస్తున్నట్టు సమాచారం. 
 
జియో ఫోన్‌ ధర రూ.1,500 ఉండగా ఎయిర్‌టెల్‌ తన 4జి ఫోన్‌ని రూ.1000లకే అందించబోతోందని ఓ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే రిలయన్స్‌ జియో మాదిరిగా ఎయిర్‌టెల్‌ కూడా మూడేళ్ల తర్వాత ఈ ఫోన్‌ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
 
దాదాపు 50 కోట్ల వరకు ఉన్న ఫీచర్‌ మొబైల్‌ ఫోన్ల వినియోగదారులను 4జి సేవలవైపు మళ్లించేందుకు జియో ఈ ప్రయోగానికి తెరతీసింది. దీంతో జియో పోటీని ఎదుర్కోవాలంటే తామూ అదే వ్యూహంతో వెళ్లక తప్పదని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి.