మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (13:02 IST)

వచ్చే ఏడాది యాపిల్ క్రెడిట్ కార్డు.. వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు ప్రారంభం

ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ శాక్స్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డు తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ క్రెడిట్ కార్డును యాపిల్ తీసుకురానుంది

ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ శాక్స్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డు తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ క్రెడిట్ కార్డును యాపిల్ తీసుకురానుంది. ఇందుకోసం గోల్డ్ మ్యాన్ ‌శాక్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.
 
అంతేగాకుండా యాపిల్ ఆదాయం పెరుగుతుందని.. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుందని యాపిల్ భావిస్తోంది. ముఖ్యంగా భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించారు.
 
మరోవైపు యాపిల్ నుంచి వాచ్ సిరీస్ 3 ఎల్టీఈ విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో యాపిల్ స్మార్ట్ వాచ్‌లను ఉచిత సిమ్ కార్డుతో స్వయంగా విక్రయాలు నిర్వహిస్తున్నాయి. యాపిల్ సిరీస్ 3 వాచ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 38ఎంఎం ప్రారంభ ధర రూ.39,080. 42ఎంఎం ధర రూ.41,120. వీటిని జియో డాట్ కామ్, ఎయిర్ టెల్ డాట్ ఇన్ వెబ్ సైట్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునని యాపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.