శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (11:15 IST)

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌‌కి నేషనల్ అవార్డ్

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌‌కి ఇ-గవర్నెన్స్‌లో నేషనల్ అవార్డ్ సంపాదించుకొంది. ఐఆర్‌సీటీసీ ఈ యాప్‌ ద్వారా రైలు టిక్కెట్ బుకింగ్‌ను సులభతరం చేయడంతోపాటు ప్రయాణికులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఆర్‌సీటీసీ నెక్స్ట్-జెనరేషన్ ఇ-టికెటింగ్ సిస్టమ్ 2014లో లాంఛ్ చేయడం జరిగింది. 
 
2014లో ఐఆర్సీటీసీ కనెక్ట్ పేరుతో లాంఛ్ చేసిన ఈ యాప్‌ను 2017లో 'ఐఆర్సీసీటీ రైల్ కనెక్ట్' యాప్‌ పేరుతో రీలాంఛ్ చేసి బుకింగ్ సామర్థ్యాన్ని నిమిషానికి 2,000 టికెట్ల నుండి 20,000 టికెట్లకు పెంచారు. 2017 జనవరి నాటికి మూడు కోట్ల మంది యూజర్లు ఉండగా 14 కోట్ల బుకింగ్స్ జరిగాయి. 
 
ఇప్పటికి రోజూ 45 లక్షల మంది యూజర్లు సేవలు పొందుతున్నారని అంచనా ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో సేవలు అందిస్తున్న ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ సేవలకుగానూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటీవ్ రీఫామ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ ఈ అవార్డుని ప్రకటించింది.