శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 మే 2017 (09:57 IST)

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై జూడీ పంజా... ఇప్పటికే 3.6 కోట్ల ఫోన్లలో పాగా

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై జూడీ అనే మాల్‌వేర్ పంజా విసురుతోంది. ఇప్పటికే 3.65 కోట్ల ఫోన్లలో ఈ సైబర్ భూతం పాగా వేసినట్టు వార్తలు వస్తున్

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై జూడీ అనే మాల్‌వేర్ పంజా విసురుతోంది. ఇప్పటికే 3.65 కోట్ల ఫోన్లలో ఈ సైబర్ భూతం పాగా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌తో అనేక యాప్‌లు కుమ్మక్కవగా.. ఫ్యాషన్, కుకింగ్ గేమ్స్ ముసుగులో గూగుల్ ప్లేస్టోర్‌ని సైతం స్థావరంగా వాడుకున్నాయి. వీటిలో ఓ యాప్ అయితే ఏకంగా సంవత్సరం పాటు గూగుల్ ప్లేస్టోర్లో తిష్టవేయడం విశేషం.
 
సైబర్ సెక్యూరిటీ సంస్థ 'చెక్ పాయింట్' కథనం మేరకు ఒక్కసారి ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే... ఇక సదరు ఆండ్రాయిడ్ ఫోన్ 'జూడీ' చేతిలోకి వెళ్లినట్టే. ఇన్‌స్టాల్ చేసింది మొదలు.. ఈ మాల్‌వేర్ సదరు ఫోన్ నుంచి యూజర్‌కి తెలియకుండానే గూగుల్ యాడ్‌లను క్లిక్ చేయడం మొదలు పెడుతుంది. తద్వారా ప్రకటనల ఆదాయం సైబర్ దొంగల జేబుల్లోకి వెళుతుంది. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని యాప్‌లను ఇప్పటికే ఏరివేసింది.