శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (16:24 IST)

వన్‌ప్లస్ ప్రత్యేక ఆఫర్‌... అదీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్‌కు మాత్రమే..

Teachers
ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మొబైల్స్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఇందుకు గాను వన్‌ప్లస్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ పేరిట ఓ ప్రోగ్రామ్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులు, ఉపాధ్యాయులు తగ్గింపు ధరలకు వన్‌ప్లస్ ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేయవచ్చు.
 
వన్‌ప్లస్ అందిస్తున్న ఆఫర్ కింద స్టూడెంట్లు, టీచర్లు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లపై వెయ్యి రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే యాక్ససరీలపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు. అయితే ఈ ఆఫర్‌ను వాడుకోవాలంటే వారు స్టూడెంట్ బీన్స్ ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఇక దేశంలోని 760 యూనివర్సిటీలు, 38,498 కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు వన్‌ప్లస్ తెలియజేసింది.
 
వన్‌ప్లస్ ఆఫర్ ద్వారా కేవలం ఒక్కసారి మాత్రమే డిస్కౌంట్‌ను పొందేందుకు వీలుంటుంది. అంటే ఎవరైనా సరే ఒకరు ఒకసారి మాత్రమే ఆఫర్‌ను వాడుకోవచ్చు. ఫోన్ లేదా యాక్ససరీలు దేనిపైనైనా ఒకసారి మాత్రమే డిస్కౌంట్‌ను పొందవచ్చు.