గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (15:59 IST)

వీడియో గేమ్‌లతో ఏకాగ్రత.. చురుకుదనం పెరుగుతుందట.. కానీ?

స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లకు తోడు టీవీల్లో బొమ్మ సినిమాలు, వీడియో గేమ్‌లంటేనే పిల్లలకు మరింత ఆసక్తి. తొమ్మిది నుంచి పదేళ్ల లోపు ఉన్న అమ్మాయిలు.. అబ్బాయిలు టీవీ, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను గంటల పాటు

స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లకు తోడు టీవీల్లో బొమ్మ సినిమాలు, వీడియో గేమ్‌లంటేనే పిల్లలకు మరింత ఆసక్తి. తొమ్మిది నుంచి పదేళ్ల లోపు ఉన్న అమ్మాయిలు.. అబ్బాయిలు టీవీ, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను గంటల పాటు వాడకపోవడం మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు గంటలకు పైబడితే మాత్రం డయాబెటిస్ తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే వీడియో గేమ్‌లు ఆడటం ద్వారా మానవ మెదడు బాగా ప్రభావితం అవుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. వీడియో గేమ్స్ ద్వారా ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతుంది. ఇంకా భిన్నంగా ఆలోచించే స్వ‌భావం అలవాటు అవుతుంది. అయితే... ఇక చెడు ప‌రిణామాలను తీసుకుంటే, వీడియో గేమ్‌లు ఒక వ్య‌స‌నంగా మారిపోయే ఛాన్సుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
మారుతున్న టెక్నాల‌జీ, చౌక‌గా లభించే డేటాతో కంప్యూట‌ర్లు, టాబ్లెట్లు, క‌న్సోల్‌ల వ‌ల్ల వీడియో గేమ్‌లు ఆడే వారి సంఖ్య పెరిగిపోతుంది. చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వీడియో గేమ్‌లకు అలవాటు పడిపోతున్నారు. అయితే వీడియో గేమ్‌లు ఆడే స‌మ‌యంలో ఒక్కో లెవ‌ల్‌కి అనుగుణంగా మెద‌డులోని ఒక్కో భాగం ప్ర‌భావిత‌మ‌వుతోంద‌ని, అందుకే ఏకాగ్ర‌త‌, చురుకుద‌నం పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.