బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Modified: శనివారం, 13 ఆగస్టు 2016 (16:23 IST)

ఎన్టీఆర్ దంప‌తుల‌కు పిండ ప్ర‌దానం చేసిన సీఎం చంద్ర‌బాబు

గుంటూరు : కృష్ణా పుష్కారాలు నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దంపతులకు సీఎం చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. అలాగే ఆయన తన తల్లిదండ్ర

గుంటూరు : కృష్ణా పుష్కారాలు నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దంపతులకు సీఎం చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. అలాగే ఆయన తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు కూడా చంద్రబాబు పిండ ప్రదానం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడుని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రార్థించారు.