శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (10:58 IST)

హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 23కి చేరిన మృతులు!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ బస్సు 400 అడుగుల లోతులో ఉండే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మరణించారని భావించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదం ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 
 
ప్రమాద స్థలంలో 15 మంది మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషన్ డిడి శర్మ వెల్లడించారు. 
 
సాంగ్లా నుంచి కల్పాకు బయలుదేరిన బస్సు మధ్యలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడినవారిని బయటకు తీసి అస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి వారి బంధువులకు అప్పగించనున్నట్లు శర్మ చెప్పారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమం ఉంది.