బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:54 IST)

పెద్దలు కుదర్చిన పెళ్లి ఇష్టం లేక.. ఆ యువతి ఏం చేసిందంటే?

పెద్దలు నిశ్చయించిన పెళ్ళి చేసుకునేందుకు ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తినే పెళ్ళాడేందుకు సిద్ధమైన ఓ అమ్మాయి పక్కా ప్లాన్ చేసింది. ఆ ప్లానులో ఆ యువతే ఇరుక్కుపోయింది. వివరాల్లోకి వెళితే... ఈశాన్య ఢిల్లీ సీ

పెద్దలు నిశ్చయించిన పెళ్ళి చేసుకునేందుకు ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తినే పెళ్ళాడేందుకు సిద్ధమైన ఓ అమ్మాయి పక్కా ప్లాన్ చేసింది. ఆ ప్లానులో ఆ యువతే ఇరుక్కుపోయింది. వివరాల్లోకి వెళితే... ఈశాన్య ఢిల్లీ సీలంపూర్‌కు చెందిన షబానాకు త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి కూడా కుదిర్చారు. పెళ్లి పనుల్లో కుటుంబమంతా నిమగ్నమై ఉన్న వేళ, ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని వధువు డ్రామా చేసింది.
 
ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు లోనికి చొరబడ్డారని వధువు చెప్పింది. అంతేగాకుండా, తనను బెదిరించారని, రూ.20 లక్షల నగదు, నగలు దోచుకుపోయారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో వధువుపై అనుమానంతో ఆమె ఫోన్ డేటాను చెక్ చేశారు. దొంగతనం జరిగిన సమయంలో ఆమె ఫోన్ నుంచి ఒకే నంబరుకు చాలా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. 
 
అది అనీష్ దనే వ్యక్తిదని, అనీష్, షబానా మధ్య ప్రేమాయణం నడుస్తోందని, పెద్దలకు తెలియకుండా వారు పెళ్లి కూడా చేసుకున్నారని తేలింది. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లికి సిద్ధమైన షబానా.. దొంగతనం చేశాడనే అపవాదును వరుడి కుటుంబంపై వేయాలనుకుంది. ఆపై తాను ప్రేమించిన వ్యక్తితోనే సంసారం చేయాలనుకుని ప్లాన్ చేసింది. అయితే సీన్ రివర్సై పోలీసులు మొత్తం కనిపెట్టేయడంతో అనీష్, షబానాలు అరెస్ట్ అయ్యారు.