శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (11:07 IST)

ఇంట్లోకి మేక వచ్చిందనీ.. తలలు పగులగొట్టుకున్నారు...

ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన గొడవల్లో ఓ యువకుడు (24) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంట్లోకి వెళ్లి

ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన గొడవల్లో ఓ యువకుడు (24) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంట్లోకి వెళ్లింది. దీంతో జావేద్‌ కుటుంబ సభ్యులు మేక తమ ఇంట్లోకి వచ్చిందని గట్టిగా కేకలు పెట్టారు. దీంతో జావెద్, సమయుద్దీన్ కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది. 
 
చిన్నగా మొదలైన గొడవ పెనుతుఫానులా మారింది. ఇరువురి మధ్య గొడవ పెరిగి... కర్రలతో పోట్లాడుకున్నారు. అనంతరం తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటనలో జావెద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘర్షణలో జావెద్ సోదరికి, మరో బంధువుకు కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడినుండి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.