శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:43 IST)

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ.. గదిలోకి తొంగి చూసింది.. అంతే..?

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ జరుగుతుందని చూసేందుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారయత్నానికి గురైంది. తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుల బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ జరుగుతుందని చూసేందుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారయత్నానికి గురైంది. తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుల బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే...  రాత్రి 10 గంటల సమయంలో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న యువతి, విధులు ముగించుకుని, ఇంటికి వచ్చి మెట్ల మార్గం ద్వారా రెండో అంతస్తుకు వెళుతున్న వేళ, మొదటి అంతస్తులో కొందరు యువకులు మందు కొట్టి గొడవ చేస్తుండటాన్ని గమనించింది. వారిపై ఫిర్యాదు చేయాలని భావించి, గదిలో ఎవరు ఉన్నారో చూద్దామని నెమ్మదిగా తొంగి చూసింది. దీంతో ఆమె చేతిలోని లంచ్ బాక్స్ కిందపడింది. 
 
ఈ శబ్దాన్ని విన్న గది లోపలి యువకులు, ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారితో పెనుగులాడి, అరుస్తూ, తప్పించుకుంది. చివరికి ఆ యువతి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
గదిలో ఇంకా చాలామంది ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చేయడంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.