1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (20:56 IST)

వయస్సు 25.. హత్యలు 57... ఆ సీరియల్ కిల్లర్ ఎక్కడ పట్టుబడ్డాడు?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. కేవలం 25 యేళ్ళకే 57 హత్యలు చేసి ఆ రాష్ట్రాన్ని హడలెత్తించిన ఈ సీరియల్ కిల్లర్ కోసం గాలించని ప్రాంతమంటూ ఏదీ లేదు. ఇలా యూపీ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తూవచ్చాడు. 
 
ఈ వివరాలు పరిశీలిస్తే... గత కొంతకాలంగా గుర్తు తెలియని ఓ సీరియల్ కిల్లర్ దోపిడీకి పాల్పడటం, ఇళ్లలోని వ్యక్తులను కడతేర్చడం, ఆపై పరారవడం... సాగుతూ వచ్చింది. ఈ దోపిడీ ముఠా కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వీరిలో ఓ ముఠా నాయకుడిని, ఇద్దరు అనుచరులను బరేలీలో అరెస్టు చేయడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. 
 
వీరివద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. పట్టుబడిన ముఠా నాయకుడే సీరియల్ కిల్లర్ అని తేలింది. అతని వయస్సు 25 ఏళ్లు. ఇప్పటివరకు దాదాపు 57 దాకా హత్యలు చేసినట్టు అంగీకరించాడు. ఓ ఇంట్లో దొంగతనానికి వెళితే, ఆ ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తూ ఎంజాయ్ చేయడం అతని నైజం. ఈయన నేతృత్వంలోని గ్యాంగ్ బరేలీ, బదౌన్, పిలిభిత్, కనౌజ్, షాజహాన్ పూర్, కాన్పూర్, హర్దోయి ప్రాంతాల్లో ఈ హత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.