1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (13:58 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: బస్సులో మంటలు.. 9 మంది మృతి!

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. యూపీలోని అమేథీలో ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగడంతో బస్సులోని 9 మంది సజీవదహనమయ్యారు. అమేథీ జిల్లాలోని పీపరాపూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిని తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశాయి.
 
మంగళవారం ఉదయం ప్రయాణికులతో బస్సు సుల్తాన్ పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. రాంగాన్ గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఆ సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగటంతో కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సుల్తాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు.