శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 30 మే 2016 (17:21 IST)

కదులుతున్న రైలు... నిద్రపోతున్న మహిళపై మూత్రం పోశాడు...

బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్ర

బెంగళూరు నుంచి చెన్నైకి రాత్రిపూట ఆ రైలు వేగంగా వస్తోంది. అర్థరాత్రి కావడంతో అంతా నిద్రపోతున్నారు. ఆ సమయంలో మూర్తి అనే వ్యక్తి మూత్రం పోసుకునేందుకు లేచాడు. మూత్ర విసర్జనకు నేరుగా టాయిలెట్ కు వెళ్లకుండా తను ప్రయాణిస్తున్న బోగీలోనే లోయర్ బెర్తులో నిద్రపోతున్న మహిళపై మూత్రం పోయడం ప్రారంభించాడు. 
 
దీనితో బిత్తరపోయి లేచిన ఆ మహిళ... ఓ వ్యక్తి తనపై మూత్రం పోయడాన్ని గమనించింది. పెద్దపెట్టున కేకలు వేయడంతో బోగీలోని వారంతా లేచారు. అంతే... మూత్రం పోస్తున్న సదరు వ్యక్తిని చితకబాదారు. అతడు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. చెన్నై స్టేషను రాగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.