శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:48 IST)

ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మివేసిన పైలట్.. చెంప పగిలిపోయింది...

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుర్గావ్‌కు చెందిన అర్పిత అనే ఎయిర్ హోస్టెస్, ఆదిత్యకుమార్ అనే పైలట్‌లు ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదిత్య మొబైల్‌ను అర్పిత పగులగొట్టేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కలుగజేసుకొని అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత అర్పిత, ఆదిత్యల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదిత్య ఆమెపై ఉమ్మివేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె ఆదిత్య చెంపపై కొట్టింది. అక్కడే ఉన్న భద్రతాసిబ్బంది కొట్టుకుంటున్న వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు వర్గాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.