1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (11:35 IST)

కుంతీదేవి అంతర్గతంపై ఐదు లైన్ల పద్యం.. మనోభావాలను గాయపరిచినట్లైతే క్షమించండి..

కేరళలోని ఓ కళాశాల ప్రచురించిన స్టూడెండ్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. కుంతీదేవి అంతర్గతాన్ని అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ద

కేరళలోని ఓ కళాశాల ప్రచురించిన స్టూడెండ్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. కుంతీదేవి అంతర్గతాన్ని అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ ఆజాద్, తాము ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదన్నారు. పాండవుల తల్లి కుంతీదేవిపై ప్రచురించిన ఐదు లైన్ల పద్యం తమ మనోభావాలను గాయపరిచినట్లైతే క్షమించాలన్నారు. మంజేరికి చెందిన ఎన్ఎస్ఎస్ కాలేజీ ప్రచురించిన మేగజైన్‌లో ఐదులైన్ల పద్యాన్ని ఓ విద్యార్థి రాసుకొచ్చాడు.
 
125 ఏళ్ల చరిత్ర కలిగిన తలసేరీలోని బ్రెనన్ కాలేజీ రెండురోజుల క్రితం ప్రచురించిన మ్యాగజైన్ కూడా వివాదాస్పదమైంది. థియేటర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఓ జంట అసభ్యకర భంగిమలో ఉన్నట్లు ప్రచురించింది. మ్యాగజైన్‌ను ప్రచురించిన కాలేజీపై ఏబీవీపీ కేసు పెడుతూ సత్వర చర్యలకు డిమాండ్ చేసింది. కాలేజీ తీరుపై దేశ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాజాగా మరో మేగజైన్ కలకలం రేపుతోంది.