శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (13:21 IST)

మాల్యాకు ఎపుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు : అరుణ్ జైట్లీ

భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖామంత్రిని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, మాల్యా ప్రక

భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖామంత్రిని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యా చేసిన వ్యాఖ్యలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, మాల్యా ప్రకటన వాస్తవ విరుద్ధమైనది. అది నిజాన్ని ప్రతిబింబించడం లేదు. 2014 నుంచి అతనికి తానెప్పుడూ కలిసేందుకు సమయం ఇవ్వలేదన్నారు.
 
కాబట్టి అతడు నన్ను కలిశాడన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ రాజ్యసభ సభ్యునిగా ఉండి అప్పుడప్పుడూ సభకు హాజరయ్యే మాల్యా.. నేను పార్లమెంట్ నుంచి నా కార్యాలయానికి వెళ్తుండగా పలుకరించాడు. నా వెంట వేగంగా నడిచి వస్తూ నేను రుణాల చెల్లింపునకు ఓ ఆఫర్‌ను ప్రకటించాను అని చెప్పాడు. 
 
మోసపూరిత సెటిల్‌మెంట్ గురించి అంతకుముందే తెలుసుకున్న నేను సంభాషణను కొనసాగించేందుకు అనుమతించలేదు. కనీసం అతడి చేతిలో ఉన్న కాగితాలను తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. బ్యాంకులకు రుణపడ్డ వ్యక్తిగా అతనికి నేను ఎప్పుడూ సమయం ఇచ్చింది లేదు అని అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు.