శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (16:00 IST)

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏడాది.. నెహ్రూ వర్శిటీలో విద్యార్థుల వద్ద విచారణ ఎందుకు?

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని సర్కారు ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. గత సంవత్సరం ఇదే రోజున ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రేమలో పడిందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. 'ఢిల్లీ ప్రజలు ఏఏపీతో ప్రేమలో పడిన రోజు ఇది' అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ప్రజలతో ఈ బంధం నిత్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
 
ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అఫ్జల్ గురును తలచుకుంటూ కార్యక్రమాలు నిర్వహించి, ఆపై తీవ్ర వివాదానికి కారణమైన విద్యార్థుల్లో కొందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు విచారణ జరుపుతున్న పోలీసు వర్గాలు పసిగట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందానికి అప్పగించాలని స్థానిక పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.