శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (12:59 IST)

కేజ్రీవాల్ ఇంటికి కరెంట్ బిల్లు రూ.91 వేలు: సామాన్యుడి ఇంటికి అంత కరెంటా?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సామాన్య నేతగా రాజకీయాల్లో అడుగెట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలకు, మంత్రులకు రెడ్ లైటులో వద్దంటూ.. రోడ్డుపై భద్రత లేకుండా తిరిగే అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీకి రెండోసారిగా సీఎం అయ్యాక తన లైఫ్ స్టైల్‌ని విలాసవంతంగా మార్చుకున్నారు. ఇందుకు ఆయన ఇంటి కరెంట్ బిల్లే నిదర్శనం. కేజ్రీవాల్ స్వగృహానికి మే నెలల్లో వచ్చిన కరెంట్ బిల్లు రూ.91 వేలని తేలింది. 
 
ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ, ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం వెల్లడించింది. సివిల్ లైన్స్‌లోని ఆయన నివాసంలో ఈ మేరకు కరెంటు బిల్లులు వచ్చాయని తెలిపింది.
 
అయితే సామాన్యుడంటూ ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. సీఎంగా పదవీ బాధ్యతలకు చేపట్టాక సామాన్యుడి నినాదాన్ని వదిలేసినట్టుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.