శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (17:42 IST)

అద్వానీపై అభియోగాలు నమోదు చేస్తే.. రాష్ట్రపతి రేస్ నుంచి తప్పుకుంటారా?

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ మసీదు కూల్చివేత కేసులో అద్వానీతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలను కుట్రదారులుగా చేర్చాలా? వద్దా అన్

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ మసీదు కూల్చివేత కేసులో అద్వానీతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలను కుట్రదారులుగా చేర్చాలా? వద్దా అన్న అంశంపై సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలివ్వనుంది. 
 
నిజానికి అత్యున్నత న్యాయస్థానం బుధవారమే తీర్పు చెప్పాల్సి ఉండగా గురువారానికి వాయిదా వేసింది. గతంలో అద్వానీతో సహ 13 మందిపై కింది కోర్టు అభియోగాలను కొట్టివేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సాంకేతిక కారణాలు చూపుతూ అభియోగాలను కొట్టివేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కనుక గురువారం అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కతియార్, కళ్యాణ్ సింగ్‌లను నిందితులుగా పేర్కొన్నపక్షంలో వారిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. 
 
ఇదే జరిగితే భారత రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేస్‌లో ఉన్న ఎల్కే.అద్వానీ పరిస్థితి ఏమిటన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అభియోగాలు నమోదు చేసినప్పటికీ.. ఆయన రాష్ట్రపతి అభ్యర్థి రేస్‌లో ఉంటారా? లేక తప్పుకుంటారా? అన్నది తేలాల్సివుంది.