1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2016 (15:53 IST)

వివాహేతర సంబంధం బయటపడుతుందనీ ఆత్మహత్య చేసుకున్న మహిళ!

ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తాను సాగిస్తున్న వివాహేతర సంబంధం తన భర్తతో పాటు కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భావించి ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బెంగుళూరు నగరంలోని యలహంకలో జరిగిన ఈ ఆత్మహత్య వివరాలను పరిశీలిస్తే... 
 
యలహంక, హోబళి నాగదానసహళ్ళి పీఎల్‌డీ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ ఎన్.డి.జగదీష్‌‍తో ఆమెకు పరిచయమేర్పడింది. ఇది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ తరచూ మొబైల్ శ్వేత మొబైల్‌లో మాట్లాడుకునేవారు. ఈ విషయన్ని భర్త రాఘవేంద్ర గుర్తించి ఎవరితో మాట్లాడుతున్నావంటూ గట్టిగా ప్రశ్నించాడు.
 
దీంతో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని భావించిన శ్వేత ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు జగదీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే సందర్భంలో జగదీష్‌ ఇంటి ముందు ఆపివుంచిన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కేఎస్‌ఆర్‌పీ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.