శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (10:52 IST)

తాళి కట్టాక ప్రియుడితో వధువు జంప్... కేట్‌ కట్ చేసి పార్టీ చేసుకున్న వరుడి ఫ్యామిలీ

కేరళలో ప్రతి ఒక్కరినీ విస్మయపరిచే సంఘటన ఒకటి జరిగింది. ఒక యువతి మెడలో మూడుముళ్లు పడిన తర్వాత ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు కళ్యాణ మండపంలోనే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చే

కేరళలో ప్రతి ఒక్కరినీ విస్మయపరిచే సంఘటన ఒకటి జరిగింది. ఒక యువతి మెడలో మూడుముళ్లు పడిన తర్వాత ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.  దీంతో వరుడి కుటుంబ సభ్యులు కళ్యాణ మండపంలోనే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని గురువాయూరు ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ రాష్ట్రంలోని కొండుగల్లూరు ప్రాంతానికి చెందిన స్మిత అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన సంతోష్‌పై పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఆ ప్రకారంగానే రెండు రోజుల క్రితం ఇరు కుటుంబాల సభ్యులు, బంధువుల సమక్షంలో గురువాయూరు ఆలయంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సరిగ్గా వధువు మెడలో మూడు ముళ్లు పడిన తర్వాత స్మిత ప్రేమించిన యువకుడు కళ్యాణ వేదిక వద్దకు వచ్చాడు. 
 
తన ప్రియుడిని చూడగానే స్మిత.. పెళ్లి పీటల మీదనుంచి లేచిపోయి ప్రియుడి చేయి పట్టుకుంది. దీంతో ఒక్కసారి అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని స్మితను ఆమె ప్రియుడితో వెళ్లేందుకు సమ్మతించారు. అయితే, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేసినందుకు వరుడు కుటుం సభ్యులకు రూ.8 లక్షల పరిహారం చెల్లించేందుకు వధువు తల్లిదండ్రులు సమ్మతించారు. అదేసమయంలో స్మిత ఇచ్చిన జర్క్ నుంచి తేరుకునేందుకు వరుడు, వధువు కుటుంబ సభ్యులు కళ్యాణ్ వేదికపైనే కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.