1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2023 (15:42 IST)

గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టిన దండగులు...

thieves
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టిన దండుగలు...  లక్షలాది రూపాయలతో పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూక్కీ జిల్లాలోని ధండేరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మొత్తం నలుగురు దొంగలు ఈ చోరీలో పాలుపంచుకున్నారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఒంటికి దుప్పట్లు చుట్టుకున్న ముగ్గురు దుండగులు ఏటీఎం నుంచి నగదు ఉన్న సంచులతో బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. బయట ఉన్న పార్క్ చేసిన తెల్లని స్కార్పియో వాహనంలోని డిక్కీలో ఆ డబ్బు సంచులు పడేసి అందరూ కారెక్కి పరారయ్యారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎంకు చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం ఆ ప్రాంతంలో గాలించారు. నిందితులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేయడం వల్ల లోపల ఉన్న నగదు కొంత కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. కాలిపోయిన డబ్బులు వదిలి మిగతా సొత్తుతో వారు పరారైనట్టు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.