ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (18:35 IST)

వృద్ధ జంట సూసైడ్... ఎందుకు?

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె మరో కులం వ్యక్తితో లేచిపోయిందనీ... ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు 24 యేళ్ళ ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఈమె తన కాలేజీలో చదివే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వేరే కులానికి చెందిన యువకుడు కావడంతో పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా, ఆ యువకుడుని మరిచిపోవాలని సూచించారు. అయినప్పటికీ.. ఆ యువతి ప్రియుడుని మరిచిపోలేక అతనితో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుంది. 
 
ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికిలోనయ్యారు. తమ పరువు పోయిందని భావించిన ఆ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి వారు ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడివున్నారు.