శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (13:09 IST)

మహిళపై వైద్యుడి అత్యాచారం.. వివస్త్రను చేసి, న్యూడ్ ఫోటోలు తీసి?

వైద్యవృత్తికే ఓ వైద్యుడు కళంకం తెచ్చాడు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె నగ్న ఫోటోలు తీసి ఐదు నెలలుగా ఆమెపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ మహిళ (27) అతడి వద్దకు వచ్చి తమ కంపెనీ మందులను వివరించింది. 
 
అలా.. వారిద్దరు సన్నిహితులయ్యారు. ఆస్పత్రికి ఎప్పుడు వచ్చినా అతడ్ని కలిసి, కొత్తగా వచ్చిన ఔషధాల వివరాలు అందిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పరీక్ష కోసం అతడు సాయం చేస్తానని, అవసరమైన గైడెన్స్ ఇస్తానని చెప్పాడు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నానని నమ్మబలికాడు.

నిజమేనని నమ్మిన ఆ మహిళ.. తనకూ పాఠాలు చెప్పాలని కోరింది. దీనికోసం ఇంటి అడ్రెస్ కూడా చెప్పాడు. డాక్టర్‌ను నమ్మిన ఆ మహిళ మత్తు మందు కలిపిన డ్రింక్ ఆఫర్ చేశాడు. 
 
ఆ డ్రింక్ తాగిన మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆ డాక్టర్ ఆమెను బెడ్‌రూంకు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను వివస్త్రను చేసి, న్యూడ్ ఫోటోలను తీసుకున్నాడు.

ఈ ఘటన గత మే లో జరిగింది. అయితే, అప్పటి నుంచి అతడు బాధితురాలి ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చుకున్నాడు. డాక్టర్ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక గత శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.