1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (17:27 IST)

చిన్నారిపై ఇద్దరు విద్యార్థినుల లైంగిక వేధింపులు.. లంచ్ టైమ్‌లో ఎవరూ లేని క్లాస్ రూమ్‌లో?

ఢిల్లీలోని సర్వోదయ కన్యా విద్యాలయాలో ఘోరం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బాలికలపై బాలురు లైంగిక వేధింపులకు పాల్పడేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. రెండో తరగతి చదివే విద్యార్థినిపై 9వ తరగతి చదివే సీనియర్ వ

ఢిల్లీలోని సర్వోదయ కన్యా విద్యాలయాలో ఘోరం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బాలికలపై బాలురు లైంగిక వేధింపులకు పాల్పడేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. రెండో తరగతి చదివే విద్యార్థినిపై 9వ తరగతి చదివే సీనియర్ విద్యార్థినులు లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఉన్న మోతీ నగర్‌ సర్వోదయ కన్యా విద్యాలయాలో చదువుతున్న మాలతీ అనే ఏడేళ్ల చిన్నారి.. తాను లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో షాక్ తిన్న మాలతీ తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసుల దర్యాప్తులో 9వ తరగతి చదివే విద్యార్థినులు మాలతీపై లైంగిక దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది. లంచ్ టైమ్‌లో ఎవరూ లేని క్లాస్ రూమ్‌కు మాలతీని తీసుకెళ్లి.. సీనియర్ విద్యార్థినులు.. లైంగికంగా వేధించారని తేలింది. గత నాలుగు నెలల పాటు మాలతీపై ఈ దుశ్చర్య జరుగుతుందని పోలీసులు తెలిపారు. దీంతో ఇద్దరు విద్యార్థినులపై సెక్షన్ 6 అండ్ 10 పోస్కో  యాక్ట్ మరియు ఐపీసీ సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు.