శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:23 IST)

దినకరన్ గూటికి 6 మంది ఎమ్మెల్యేలు.. పన్నీర్ పక్షాన 12 మంది.. పళని సర్కార్ కూలుతుందా?

తమిళనాట రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య రాజీకుదిరి గంటలైనా కాకముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు రెండు వర్గాలుగ

తమిళనాట రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య రాజీకుదిరి గంటలైనా కాకముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే.. ఇపుడు మూడో వర్గం పుట్టుకొచ్చింది. అదే టీటీవీ దినకరన్ వర్గం. 
 
పార్టీలో వైరి వర్గాలు ఒక్కటి అయ్యేందుకు పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్‌ కుటుంబాన్ని పక్కనపెట్టాలన్నది మాజీ సీఎం పన్నీర్ ప్రధాన డిమాండ్. ఆ మేరకు అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక త్రి జయకుమార్‌ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే టీటీవీ దినకరన్ వెంట ముగ్గురు చేశారు. బుధవారం ఉదయానికి ఈ సంఖ్య పదికి చేరింది. 
 
దీంతో దినకరన్ శిబిరంలో 6 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీర్ వర్గంలో 12 మంది ఉన్నారు. మిగిలిన వారు ముఖ్యమంత్రి పళనిస్వామి వెంట ఉన్నట్టు సమాచారం. అయితే, వీరిలో ఎంతమంది దినకరన్ వైపుకు వెళతారో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం పూర్తికాలం మనుగడ కొనసాగిస్తుందో.. లేదో వేచిచూడాల్సిందే. 
 
మరోవైపు పార్టీలో జరిగిన తాజా పరిణామాలపై దినకరన్ స్పందిస్తూ అన్నాడీఎంకేలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని.. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజా పరిస్థితులపై చర్చిచేందుకు ఈరోజు మధ్యాహ్నం దినకరన్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.