గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (17:44 IST)

ఫ్యాషన్ డిజైనర్‌ను.. ఆమె పనిమనిషిని హత్య చేసేశారు..

ఢిల్లీలో ఓ ఫ్యాషన్ డిజైనర్ హత్యకు గురైంది. టైలర్ల వద్ద దుస్తులు కుట్టించుకుని డబ్బులు ఎగనామం పెట్టడంతో ఆగ్రహానికి గురైన టైలర్లు ఆమెను హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖని (53)ని ఆమె ఇంట్లో పనిచేసే టైలర్ బహదూర్ (50) హత్య చేశాడు.


వసంత్ కుంజ్ ఎన్‌క్లేవ్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. 
 
చాలా రకాల దుస్తులను బహదూర్ చేత కుట్టించుకున్న మాలా.. వాటికి డబ్బులు ఇవ్వలేదు. ఎంత అడిగినా రేపు రేపు అంటూ  కథలు చెప్తూ వచ్చింది. దీంతో కోపానికి గురైన బహదూర్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 
 
యజమానికి సహాయం చేసేందుకు ప్రయత్నించిన ఇంటి పనిమనిషిని కూడా చంపేశామన్నారు. మొత్తం ఐదుమంది ఈ హత్య చేసినట్లు టైలర్ బహదూర్ అంగీకరించాడు. దీంతో బహదూర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మాలా, పనిమనిషి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.