'పన్నీర్'కు శశికళ అండ... ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి... పెరుగుతున్న నేతల మద్దతు
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శశికళ మద్దతు ప్రకటించారు. శశికళ అంటే.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కాదు. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప. దీంతో పన్న
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శశికళ మద్దతు ప్రకటించారు. శశికళ అంటే.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కాదు. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప. దీంతో పన్నీర్ సెల్వంకు మద్దతునిచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్.. పన్నీర్కు అండగా నిలిచిన విషయం తెల్సిందే. అలాగే, మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, ఉంగళుక్కాగ ట్రస్ట్ డాక్టర్ సునీల్, ఎమ్మెల్యేలు ఆర్.కుట్టి, మాణిక్యం, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మద్దతు ప్రకటించారు.
అలాగే, ఇండియా జననాయగ కట్చి (ఐజేకే), నామ్ తమిళర్ కట్చి నిర్వాహకుడు సీమాన్, పీఎంకే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ తదితరులు కూడా మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి వీకే శశికళ ముఠా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఆ ముఠా వల్లే తాను పార్టీకి దూరమయ్యానన్నారు.
ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని తనను ఇబ్బందులు పెట్టినట్టే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కూడా రాజీనామా చేయాలని శశికళ బృందం ఒత్తిడి చేసిన ప్రజలు గుర్తించారన్నారు. పన్నీర్ సెల్వంకు మెజార్టీ నిరూపించుకొనేందుకు రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగరరావు అవకాశం కల్పించాలని, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమె కోరారు.
ఐజేకే కార్యాచరణ అధ్యక్షుడు రవి పచ్చముత్తు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన రాజకీయ వారసులుగా ఎవరినీ ప్రకటించలేదని, అయితే ఆమె ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సీఎం పదవిని పన్నీర్సెల్వంకు కట్ట బెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వ్యవహరించారన్నారు.