శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (10:13 IST)

ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి.. ఉరేసుకున్న విద్యార్థి.. ఎక్కడ?

సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుక

సోషల్ మీడియాతో ప్రయోజనాల విషయాన్ని పక్కనబెడితే నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టిన ఓ పాఠశాల విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోల్ కతా నగరంలో చోటుచేసుకుంది. కోల్ కతా నగరానికి చెందిన సంప్రీత్ బెనర్జీ అనే 9వతరగతి విద్యార్థికి అర్థసంవత్సర పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి.
 
దీంతో మనస్తాపానికి గురైన సంప్రీత్ ఫేస్‌బుక్‌లో గుడ్ బై అంటూ మెసేజ్ పెట్టి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తక్కువ మార్కులు వచ్చినపుడల్లా ఓ టీచరు తన కొడుకును చెవులు పట్టుకొని నిలబడాలని ఆదేశించాడని సంప్రీత్ తల్లి అపర్ణ ఆరోపించారు. టీచరు వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపించారు. పోలీసులు పాఠశాలలో పికెట్ ఏర్పాటు చేశారు. సంప్రీత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.