బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (06:19 IST)

మా వద్ద పిచ్చి వేషాలు వేయొద్దు : దినకరన్‌కు సుప్రీం వార్నింగ్

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దంటూ హెచ్చరించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) ఉల్లంఘన కేసులో ద

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దంటూ హెచ్చరించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) ఉల్లంఘన కేసులో దినకరన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పైగా, కేసు దర్యాప్తు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణ ఎదుర్కోవాలని దినకరన్‌కు సూచించింది. 
 
ఈ కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టు పిటీషన్ దాఖలు చేయగా అక్కడ చుక్కెరుదైంది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ దినకరన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ విచారణ ఆలస్యం చేసేందుకు మళ్లీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 
 
దినకరన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫెరా ఉల్లంఘన కింద రెండు కేసులు నమోదు చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి లేకుండా అమెరికా డాలర్లను బ్రిటన్‌లోని ఓ కంపెనీకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీంతో పాటు 44.37లక్షల పౌండ్లు విదేశాల్లో లావాదేవీలు నిర్వహించినట్లు మరో కేసు కూడా ఈడీ నమోదు చేసింది.