1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (14:10 IST)

చెన్నైలో నలుగురి ప్రాణాలు తీసిన రైల్ ఫుట్‍బోర్డు ప్రయాణం...

'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయా

'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఎలాగైనా త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వారికి మార్గమధ్యలోనే మృత్యువు ఎదురైంది. గమ్యం చేరకుండానే వారి జీవితాలను కబలించి వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం ఉదయం జరిగిన విషాద ఘటన ఇది.
 
ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చెన్నై బీచ్‌-తిరుమాల్‌పూర్‌ లోకల్‌ రైలులో జరిగింది. రైలు బాగా రద్దీగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు ఫుడ్ బోర్డుపై నిల్చుని ప్రయాణిస్తున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగానే కరెంట్ పోల్‌ను వారు ఢీకొట్టారు. దీంతో ఫుట్‌బోర్డులో ఉన్న ప్రయాణికులంతా కిందపడిపోయారు. ఇందులో నలుగురు అక్కడి కక్కడే చనిపోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి రైల్వే అధికారులు తరలించారు.