1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:11 IST)

ఇంద్రాణిని పెళ్లాడలేదు.. సహజీనం చేశాం... ఇంద్రాణి మొదటి భర్త సిద్ధార్థ్ దాస్

షీనా బోరా కేసులో ఇంద్రాణి మొదటి భర్త సిద్ధార్థ్ దాస్ రంగంలోకి వచ్చారు. తాను ఇంద్రాణిని వివాహం చేసుకోలేదని తేల్చి చెప్పారు. అయితే, ఇంద్రాణి తాను సహజీవనం చేసినట్టు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా అత్య కేసులో మృతిరాలి అసలు తండ్రిగా భావిస్తున్న ఈయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. 'షీనాను ఇంద్రాణి హత్య చేసి వుంటే ఆమెను ఉరితీయాలని కోరుకుంటున్నా' అని వ్యాఖ్యానించారు. 
 
పైగా, ఈ కేసులో ఇంతవరకు తనను ముంబై పోలీసులు సంప్రదించలేదనీ, వారికి ఆ అవసరం కూడా రాకపోవచ్చని చెప్పుకొచ్చారు. ముఖం కనిపించకుండా మీడియా ముందుకు వచ్చిన ఆయన, ఇంద్రాణి, తను వివాహం చేసుకోలేదని, 1989లో వారి ఇంట్లోనే సహజీవనం చేశామని, ఆపై విడిపోయిన తర్వాత మరెప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. మైఖేల్ బోరా కూడా తన కుమారుడేనని చెప్పారు. అయితే, ఇంద్రాణిని వివాహం చేసుకోకుండానే వీరిద్దరు పుట్టినట్టు చెప్పారు. 
 
1989లో తన వ్యక్తిగత పనుల మీద షిల్లాంగ్ వెళ్లిన ఇంద్రాణి ఆ తర్వాత తన కంటికి కనిపించలేదని చెప్పారు. అయితే, తాను ఆమె కోసం గాలిస్తూ షిల్లాంగ్ వెళ్లానని, అక్కడ లేక పోవడంతో ఇంద్రాణి తల్లిదండ్రులు నివశించే గౌహతికి వెళ్లగా, వారు ఇంట్లోకి కూడా రానివ్వలేదని చెప్పాడు. ఆ తర్వాత తాను గౌహతిని వదిలివేసి.. కోల్‌కతాకు వెళ్లి.. డమ్ డమ్ ఏరియాలో భార్య, 16 యేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నట్టు చెప్పారు. ఖచ్చితంగా డబ్బు కోసమే తన కుమార్తె షీనా బోరాను ఇంద్రాణి హత్య చేసి ఉంటుందని ఆయన గట్టిగా వాదిస్తున్నాడు.