ఏపీకి ప్రత్యేక హోదాపై తుది నిర్ణయం తీసుకోలేదు: హోంశాఖ
విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ఇందర్జిత్ సింగ్ తేటతెల్లం చేసినప్పటికీ.. కేంద్ర హోంశాఖ వర్గాలు మాత్రం ఇంకా బుకాయిస్తూనే ఉన్నాయి. ‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను కల్పించే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాయి.
ఏపీ ఎంపీలకు ఇంద్రజిత్ సింగ్ ఇచ్చిన జవాబుతో ప్రత్యేక హోదాపై ఇక ఆశలు వదులుకోక తప్పదనే అభిప్రాయం ఏర్పడింది. విపక్షాల నిరసనలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ అంశంపై కేంద్ర హోంశాఖ వర్గాలు స్పందించాయి.
‘ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై హోంశాఖ ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’ అని తెలిపాయి. బీజేపీ నేత సుధాన్షు త్రివేదీ ఇదేవిషయం చెప్పారు.