శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (14:17 IST)

కట్నం కోసం.. లేడీ పోలీసునే కడతేర్చిన భర్త.. ఎక్కడ?

కావలసింది.. కట్నం. కానిస్టేబుల్ కాదు.. పోలీసైతే ఏంటి? చెప్పిన కట్నం తేవాలి కదా.. ఇదీ ఆ అమ్మాకొడుకుల తీరు. అడిగిన కట్నం తీసుకురాలేదని భర్త, అత్తమామలు కలిసి ఓ మహిళా పోలీసునే హతమార్చారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసే వరకట్న పిశాచానికి బలయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మీరట్‌లోని ఖటౌలి ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌ రేణుకి ఓ కంప్యూటర్‌ ఇంజినీరుతో ఏడాది క్రితం వివాహమైంది. కొంత కాలం వారి సంసారం బాగానే నడిచింది. అయితే కొన్నాళ్ళకు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. భర్త ఛీదరింపులు.. అత్తమామల సూటిపోటి మాటలతో నరకం అనుభవించింది. ఎంత పోలీసైనా తానూ ఓ ఇల్లాలునే అని ఆమె సర్దుకుపోవడం మొదలు పెట్టింది. 
 
అయితే వారి వేధింపులు రెట్టింపయ్యాయి. ఆమెను కొట్టి తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలు ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.