ఎట్టకేలకు నోరు విప్పిన మన్మోహన్ : నా డ్యూటీ చేశానంతే!!
ఎట్టకేలకు మాజీ ప్రధాన మంత్రి నోరు విప్పారు. 2జీ స్కామ్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ప్రధానినే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. మన్మోహన్ స్పందించారు. ప్రధానమంత్రిగా తన డ్యూటీ తాను చేశానని, తన మంత్రివర్గంలో వున్న వాళ్ళు తప్పులు చేశారో లేదో తనకు తెలియదని మన్మోహన్ స్పష్టం చేశారు.
మన్మోహన్సింగ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన కుమార్తె దమన్సింగ్ రాసిన ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... ‘‘నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి చేశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’ అంటూ రెండంటే రెండు ముక్కల్లో చెప్పారు.