శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 28 జనవరి 2016 (13:07 IST)

అన్నీ పీకేశాక అమీర్ ఖాన్ కళ్లు తెరిచాడు... ఇంతకీ ఏం చెప్తున్నాడంటే...?

బాలీవుడ్ టాప్ సెలబ్రిటీల్లో పేరున్న నటుడు అమీర్ ఖాన్ అన్నీ పీకేసిన తర్వాత కళ్లు తెరిచాడు. బ్రాండ్ అంబాసిడర్ పదవి పోవడమే కాకుండా ఆయన చిత్రాలపైన కూడా అమీర్ ఖాన్ చేసిన అసహనం వ్యాఖ్యల ప్రభావం పడుతున్నాయి. పైగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని వీలున్నప్పుడల్లా మీడియా ప్రస్తావన చేస్తూనే ఉంది. మరోవైపు తోటి సెలబ్రిటీలు సైతం మెల్లగా అమీర్ ఖాన్ పైన మెల్లగా మాటల దాడి మొదలుపెట్టారు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా మాట్లాడాడు. 
 
దేశం అన్నాక కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. పరిస్థితులు కూడా కొందరి వల్ల మారుతుంటాయి. అంతమాత్రాన పౌరులుగా మనం అంతా కలిసికట్టుగా ఆ సమస్యలను ఎదుర్కోవాలి కానీ దేశం వీృడి వెళ్లిపోతామంటూ స్టేట్మెంట్లు ఇవ్వరాదని పరోక్షంగా అమీర్ ఖాన్ చేసిన అసహనం వ్యాఖ్యలకు గురిపెడుతూ మాట్లాడాడు. దీనితో ఇక లాభం లేదనుకున్న అమీర్ ఖాన్ సోమవారం నాడు లైన్లోకి వచ్చేశాడు. 
 
తను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన మీడియాకు కూడా ఇందులో భాగం ఉందంటూ చెప్పిన అమీర్ ఖాన్, తను ఇక్కడే పుట్టాననీ, కాబట్టి ఇక్కడే కన్నుమూస్తానని చెప్పారు. తను షూటింగుల నిమిత్తం విదేశాలకు వెళ్లినా రెండు వారాలకు మించి ఉండలేననీ, ఆ తర్వాత వెంటనే హోమ్ సిక్ అవుతానని చెప్పుకొచ్చారు. కనుక తన భార్య చెప్పిన మాటలను ఏదో నోరు జారి అన్నాడని అందరూ అనుకోవాలి. మరి ఇకనైనా మీడియా, ఇతర సెలబ్రిటీలు అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యలను వదిలేస్తారో లేదో చూడాలి.